అత్యంత ప్రసిద్ధి చెందిన పశు జాతుల్లో ఒంగోలు జాతి పశువులు ఒకటి. తెల్లని దేహం.. బలమైన కండరాలు… విశాలమైన ఛాతీ… ధృడమైన కొమ్ములు. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే అపురూపమైన దేశీ పశుజాతి ఒంగోలు జాతి రకం పశువులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక గుర్తింపును చాటి చెప్పేలా ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2026 ఆగస్టు 28న మంత్రి నారాలోకేష్ ఆవిష్కరించారు. ఒంగోలు గిత్త విశిష్టతను భావితరాలకు పరిచయం చేయడంతోపాటు ప్రకాశం సంస్కృతి, పశుసంపదకు ప్రతీకగా నిలుస్తుంది.
