వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభోత్సవ చిత్రాలు

వెలిగొండ ప్రాజెక్టుకు 1996 మార్చి 5న చంద్రబాబునాయుడు, 2004 అక్టోబరు 27న మరోసారి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూడు దశాబ్దాల తరువాత 2026 ఆగస్టు 31న వెలిగొండ మొదటి ఫేజ్ ను చంద్రబాబునాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ప్రధానమంత్రి నోట.. కడప జిల్లా రైతు విజయగాధ

టమోటా, అరటి పంటల స్థానంలో అవకాడో పంట సాగు చేసి మంచి ఫలితాలను సాధిస్తున్న వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్లకు చెందిన రైతు కర్ణ వరదారెడ్డిని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రశంసించారు. 2026 ఆగస్టు 30న నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో రైతు కృషిని కొనియాడారు. ప్రధానమంత్రి మాటల్లోనే… ఈ రోజుల్లో అవోకాడో పండుకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఒకప్పుడు దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవడమే కాకుండా, దీనికి డిమాండ్ కూడా చాలా […]
గండికోటకు కృష్ణాజలాల చేరిక

నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయరు నుంచి వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట జలాశయానికి కృష్ణా జలాలు చేరుతున్నాయి. 2026 ఆగస్టు 30వతేది రాత్రి నీటి చేరిక ప్రారంభమైంది. అవుకు జలాశయం నుంచి 57కి.మీ జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా ప్రవహించి గండికోట సొరంగం ద్వారా గండికోట ప్రాజెక్టులోకి 3300క్యూసెక్కులు నీరు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. 26.850టీఎంసీలు సామర్థ్యం కలిగిన జలాశయంలో ప్రస్తుతం 12.686టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 21.744టీఎంసీలు ఉండేవి.
ఒంగోలు గిత్త విగ్రహం ఆవిష్కరణ

అత్యంత ప్రసిద్ధి చెందిన పశు జాతుల్లో ఒంగోలు జాతి పశువులు ఒకటి. తెల్లని దేహం.. బలమైన కండరాలు… విశాలమైన ఛాతీ… ధృడమైన కొమ్ములు. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే అపురూపమైన దేశీ పశుజాతి ఒంగోలు జాతి రకం పశువులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక గుర్తింపును చాటి చెప్పేలా ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2026 ఆగస్టు 28న మంత్రి నారాలోకేష్ ఆవిష్కరించారు. ఒంగోలు గిత్త విశిష్టతను భావితరాలకు పరిచయం చేయడంతోపాటు ప్రకాశం […]
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

వెలిగొండ ప్రాజెక్టు కోసం పోరాటం చేసిన కమ్యూనిస్టు నాయకుడు, మార్కాపురం, యర్రగొండిపాలె నియోజకవర్గాల నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పూల సుబ్బయ్య పేరును పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరం చేశారు. కృష్ణా వరద జలాలను జంట సొరంగాల ద్వారా మళ్లించి ఫీడర్ కాలువ ద్వారా నల్లమలసాగర్ జలాశయంలో 53.85టీఎంసీలు నిల్వ చేస్తారు. జలాశయం నుంచి తీగలేరు కాలువ, గొట్టిపడియ కాలువ, తూర్పు ప్రధాన కాలువల ద్వారా 4,47,300ఎకరాలకు నీరు సరఫరా చేస్తారు. ప్రకాశం జిల్లాలో 3మండలాలు, మార్కాపురం […]
పూలసుబ్బయ్య

కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలతో అనుబంధం పెంచుకున్న నాయకుడు పూల సుబ్బయ్య. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతంలో రాజకీయ ప్రాతినిథ్యం వహించిన సుబ్బయ్య కంభంలో 1929 జూన్ 4న జన్మించారు. 1988జూన్ 23న కన్నుమూశారు. 1952లో కంభం పంచాయతీ వార్డు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి చెందిన పూల సుబ్బయ్య ఆతరువాత మార్కాపురం చేరుకుని న్యాయవాదిగా పనిచేస్తూ ప్రజలతో సంబంధాలను పెంచుకున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. మార్కాపురం, యర్రగొండపాలెం, ప్రకాశం ప్రాంతాలు […]
ఒంటిమిట్ట ఆలయ నిర్మాణం

క్రీ.శ. 1356లో అప్పటి విజయనగర చక్రవర్తి సంగమ బుక్కరాయలు ఒంటిమిట్టలో కోదండ రామాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటికి గర్భాలయం, అంతరాలయం, ఆలయంపైన చిన్న విమాన గోపురం ఉండేది. ఆ తరువాత ఆలయానికి రెండు, మూడు దశల్లో నిర్మాణాలు జరిగాయి. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శిలలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. అంతరాళ భవనం తరువాత ముఖ మంటపం నిర్మించారు. ఇందుకోసం ఉపయోగించిన శిలలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ ముఖ మంటపం ఎవరు నిర్మించారో […]
ఆచార్య అప్పాజోశ్యుల సత్యనారాయణకు గడియారం సాహిత్య పురస్కారం

బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ప్రముఖకవి, ప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త ఆచార్య అప్పాజోశ్యుల సత్యనారాయణ మహాకవి డాక్టర్ గడియారం వేంకట శేషశాస్త్రి 45వ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈవిషయాన్ని రచన సాహిత్య వేదిక కార్యదర్శి భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి పేర్కొన్నారు. రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరులో ప్రొద్దుటూరులో నిర్వహించే ప్రధాన సభలో పురస్కారం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆచార్య అప్పాజోశ్యుల సత్యనారాయణ రచించిన ‘పంచవటి’ (పంచభూత తారావళులు) అనే పద్యకృతి ఎంపికైనట్లు వివరించారు. […]
ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు జిలా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. పీజిఆర్ఎస్ హాల్ లో ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు పై జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 80,103 హెక్టార్లలో శనగ పంట సాగైనట్లు తెలిపారు. దళారుల చేతుల్లో మోసపోకుండా కనీస మద్దతు ధరతో మార్క్ ఫెడ్ కొనుగోలు చేస్తుందని తెలిపారు. * కొనుగోలు […]
అవును గండికోట కాదు హుండికోట

మనం పిలుస్తున్న గండికోటకు పూర్వ పేరు హుండికోట అని మీకు తెలుసా? అవును ఇది నిజమే. గండికోట ఉత్సవాల సందర్భంగా కడప జిల్లా ఇంటాక్ చాప్టర్ కన్వీనర్ చిన్నపరెడ్డి పర్యవేక్షణలో ఇంటాక్ సభ్యులు, విద్యార్థులతో కలిసి హెరిటేజ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ శాసనం వెలుగు చూసింది. గండికోట మాధవరాయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన శాసనమని, ముస్లిం పాలకులు గండికోట దుర్గాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మాధవరాయ స్వామి ఆలయాన్ని శిథిలం చేసి ఆలయ […]