Skip to main content

Baskar Pedia

వందేమాతరం అంటూ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా నడిచిన నాయకుల్లో బ్రహ్మంగారిమఠం ఓబులరాజుపల్లె గ్రామానికి చెందిన బొమ్ము రామారెడ్డి ఒకరు. 

  • జ‌న‌నం : 1914
  • మ‌ర‌ణం : 1985 జ‌న‌వ‌రి 1
  • గ్రామం : ఓబుల‌రాజుప‌ల్లె, మండ‌లం : బి.మ‌ఠం,
  • త‌ల్లి : సుబ్బమ్మ,
  • తండ్రి : పెద్దవీరారెడ్డి,
  • విద్య : స్వగ్రామంలో ప్రాధ‌మిక విద్య, బ‌ద్వేలు చియ్యపాడులో ఉన్నత విద్య, ప్రొద్దుటూరులో ఎస్ఎస్ఎల్‌సీ, మ‌ద్రాసు ల‌యోలా క‌ళాశాల‌లో పైచ‌దువ‌లు,
  • స‌హ‌చ‌ర విద్యార్థులు : నీలం సంజీవ‌రెడ్డి, కాసు బ్రహ్మానంద‌రెడ్డి, మ‌ర్రి చెన్నారెడ్డి,

ఉద్యోగ బాధ్యత‌లు : 1924 నుంచి 1938 వ‌ర‌కు క‌డ‌ప ఎస్పీ కార్యాల‌యంలో క్లర్క్‌గా విధులు. మ‌హాత్మాగాంధి సిద్ధాంతాల‌ను పాటించి ఆద‌ర్శంగా నిలిచిన జిల్లాలోని రాజ‌కీయ నాయ‌కుల‌లో మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బొమ్మురామారెడ్డి ఒక‌రు. మ‌ద్యపాన నిషేధానికి క‌ట్టుబ‌డి ఉన్నారు. ఖ‌ద్దరు దుస్తులు ధ‌రించారు. వంట త‌యారీ నుంచి వ‌డ్డించేదాకా ద‌ళితుల‌ను ఏర్పాటు చేసుకుని హ‌రిజ‌నోద్ధర‌ణ‌కు పాటుప‌డ్డారు. ఉప్పు స‌త్యాగ్రహంలో పాల్గొనే సంద‌ర్భంలో జ‌న్మించిన కుమార్తెకు క‌స్తూరిబా, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనే సంద‌ర్భంలో జ‌న్మించిన కుమారుడికి గాంధి మోహ‌న్‌రెడ్డి పేర్లు పెట్టి దేశ‌భ‌క్తిని చాటుకున్నారు మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బొమ్ము రామారెడ్డి. క‌డ‌ప గ‌డ‌ప నుంచి మ‌హాత్మాగాంధి ఇచ్చిన పిలుపుతో స్వాతంత్ర్య ర‌ణ‌రంగంలోకి దూకారు. వందేమాత‌రం అంటూ గాంధిజీ ఆశ‌యాల‌కు అనుగుణంగా న‌డ‌చి పోరాటం చేశారు. బ్రిటిష్ పాల‌కుల‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన రామారెడ్డి 1939లో బ‌ళ్లారిలో 9నెల‌ల జైలు జీవితం గ‌డిపారు. జైలు శిక్ష ముగియ‌గానే ప్రొద్దుటూరు చేరుకుని ప్రజ‌ల్లో చైత‌న్యం నింపేందుకు తెలుగుసీమ పేరుతో ప‌త్రిక‌ను న‌డిపారు. బీమ‌ఠం మండ‌లంలోని చౌద‌రివారిప‌ల్లె వ‌ద్ద మ‌డేరు ప్రాజెక్టు కోసం కృషి చేశారు.

1955లో మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం ఏర్పాటు కాగా తొలి శాస‌న‌స‌భ్యునిగా రామారెడ్డి ఎన్నిక‌య్యారు. 1964-69 మ‌ధ్య కాలంలో బ‌ద్వేలు స‌మితి అధ్యక్షుడిగా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *