
టమోటా, అరటి పంటల స్థానంలో అవకాడో పంట సాగు చేసి మంచి ఫలితాలను సాధిస్తున్న వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్లకు చెందిన రైతు కర్ణ వరదారెడ్డిని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రశంసించారు. 2026 ఆగస్టు 30న నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో రైతు కృషిని కొనియాడారు.
ప్రధానమంత్రి మాటల్లోనే…
ఈ రోజుల్లో అవోకాడో పండుకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఒకప్పుడు దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవడమే కాకుండా, దీనికి డిమాండ్ కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ నేడు ఆరోగ్య స్పృహ పెరగడం, ప్రీమియం మార్కెట్ విస్తరించడంతో ఇది చాలా మంది డైనింగ్ టేబుల్స్ పై ఎక్కువగా కనిపిస్తోంది. ఇది మన రైతులకు కూడా ఎంతో లాభదాయకంగా మారుతోంది.
కడప రైతు వరదరాజ్ గారి స్ఫూర్తిదాయక కథ
- ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన వరదరాజ్ గారు చాలా ఏళ్లుగా తన పొలంలో టమాటా, అరటి పంటలను సాగు చేసేవారు.
- ఒకరోజు తన స్నేహితుల వ్యవసాయ క్షేత్రంలో అవోకాడో పంటను చూసిన ఆయన, ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా ఆ సాగుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించారు.
- తన పొలంలో అవోకాడో సాగును ప్రారంభించి, ఇప్పటివరకు సుమారు 4 టన్నుల దిగుబడిని సాధించారు.
- పండించిన పంటను ఆయన ఎవరిపైనా ఆధారపడకుండా నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.
- కొత్త పంటను ఎంచుకోవడం, శాస్త్రీయ పద్ధతులు పాటించడం మరియు నేరుగా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆయన తన చిన్న వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా మార్చివేసి మంచి లాభాలు గడిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ ఏమన్నారంటే..
వినూత్న సాగు విధానాలతో మంచి ఫలితాలు సాధిస్తూ, వ్యవసాయంలో కొత్త అవకాశాలకు మార్గం చూపుతున్న కడప జిల్లా రైతులకు ఇది మంచి ప్రోత్సాహం. రాష్ట్ర ప్రభుత్వం, కడప జిల్లా యంత్రాంగం అందిస్తున్న సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు.. లింగాల మండలం వెలిదెండ్ల గ్రామ రైతు సాధించిన ఈ విజయం చక్కటి తార్కాణంగా నిలిచింది.
