Skip to main content

peru-seahorse-162111.hostingersite.com

ఈశ్వరీదేవి 322వ జయంతి మహోత్సవం

కాలజ్ఞానకర్త పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ దంపతుల ప్రధమ పుత్రిక ఈశ్వరీ మహాదేవి జయంతి మహోత్సవం ఈనెల 29న వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో నిర్వహించనున్నారు. 1703 స్వభాను  నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి పర్వదినాన అవతరించారు. జయంతి మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన, గుడి ఉత్సవం, గ్రామోత్సవంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని మఠాధిపతి వీర శివకుమార స్వామి తెలిపారు.

ప్లాస్టిక్ అనర్థాలపై విస్తృత అవగాహన ఆదేశం

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య అధ్యక్షతన జిల్లాలో ప్లాస్టిక్ నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలు మరియు కాలుష్య నియంత్రణ కు తీసుకోవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి చైర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ఒకే వినియోగ ప్లాస్టిక్ (Single Use Plastic – SUP) పై పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MOEF&CC) వారు GSR 320(E) తేదీ […]

లంకమలలో చింకారా

జింక జాతుల్లో అరుదైనది చింకారా (ఇండియన్ గజల్) ఒకటి. లంకమల అభయారణ్యంలోని సిద్ధవటం రేంజి పరిధిలో కొండూరు బీటు మచ్చాయకుంట అటవీ ప్రాంతంలో అమర్చిన కెమెరాకు చిక్కింది. అటవీ అధికారులు ఆప్రాంతానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. అంతరించి పోతున్న అరుదైన వన్యప్రాణుల్లో చింకారా ఒకటని అధికారులు స్పష్టం చేశారు.

రెవెన్యూ డివిజన్ల వారీగా మండలాలు

వైయస్సార్ కడపజిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అయ్యాయి. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉన్న హయాంలో రెండు డివిజన్లను నాలుగు రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు.   [table id=1 /]

200లోపు యూనిట్లు ఉంటేనే ఉచిత విద్యుత్తు

రాష్ట్ర ప్రభుత్వం SC, ST విద్యుత్ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలంటే విధిగా ప్రతి నెలా 200 యూనిట్ల లోపు వినియోగం ఉంటేనే వర్తిస్తుందని వైఎస్సార్ కడప జిల్లా  మైదుకూరు  సబ్ డివిజన్ అధికారి శ్రీకాంత్ తెలిపారు.  ఈవిషయాన్ని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు గమనించాలని సూచించారు.  200 యూనిట్లు మించితే ఉచిత విద్యుత్తు వర్తించదని, మొత్తం బిల్లును వినియోగదారుడే భరించాలని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పథకంపై అవగాహన  కల్పిస్తున్నా ఎక్కువ శాతం SC, […]

గ‌డియారం వేంక‌ట శేష శాస్త్రి

శ‌తాబ్ధపు మ‌హాక‌వుల‌లో గ‌డియారం వేంక‌ట శేష శాస్త్రి గారు ఒక‌రు. శాస్ర్రి గారి శివ‌భారతం మ‌హాకావ్యం మూలంగా చిర‌స్థాయిగా ప్రజ‌ల మ‌న‌స్సుల్లో చోటు చేసుకోగ‌ల‌దంటూ ఆనాటి ముఖ్యమంత్రి అంజ‌య్య త‌న సంతాపంలో పేర్కొన్నారు. ఈయ‌న కాలిగోటికి కూడా మేము స‌రిపోము. ఈయ‌న శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాల‌ని శాస్ర్రి గారి వ‌ర్ధంతి స‌భ‌లో మ‌న పుట్టప‌ర్తి నారాయ‌ణాచార్యులు కోరారు. ఎంద‌రో మ‌హానుభావుల్లో అందులో ఒక‌రైన గ‌డియారం వేంక‌ట శేష శాస్ర్రి మ‌న జిల్లా వాసి అయినందుకు సంతోషించాలి. […]

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం

           క్రీస్తు శకం 1356 లో అప్పటి విజయనగర చక్రవర్తి సంగమ బుక్క రాయలు ఒంటిమిట్టలో కోదండ రామాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటికి గర్భాలయం అంతరాలయం మాత్రమే ఉండేవి. ఆలయంపైన చిన్న విమాన గోపురం ఉండేది.           ఆ తరువాత ఆలయానికి రెండు మూడు దశల్లో నిర్మాణాలు జరిగాయి. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శిలలను పరిశీలిస్తే ఈ సంగతి తెలుస్తుంది. అంతరాళ భవనం తరువాత […]

జొన్నవరం వద్ద ఎత్తిపోతల పథకానికి రూ.780కోట్లు మంజూరు

వైఎస్సార్ కాంగ్రెస్ నిర్లక్షం చేసినా వైఎస్సార్ కడపజిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద కుందూనది పై ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. రూ.780కోట్లు నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది.  త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడనున్నట్లు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు.   ఎగువన వర్షాలు అనుకూలించక కృష్ణానది పరుగులు తీయక పోయినా కర్నూలు, నంద్యాల జిల్లాలో కురిసే వర్షాలతో కుందూనదిలోకి చేరే నీటిని ఒడిసిపట్టి తెలుగుగంగ కాలువలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకం   ఏర్పాటుకు […]

రంగురంగుల లకుముకి పిట్టలు

సాగునీటి పారుదల కలిగిన కేసీకాలువ ఆయకట్టు ప్రాంతంలో లకుముకి పిట్టలు (కింగ్ ఫిషర్) కనిపిస్తున్నాయి. చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నాయి. చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

పుష్పగిరి కొండపై కాకతీయుల కాలం నాటి ఆలయం

వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరి క్షేత్రం వద్ద కాకతీయుల కాలం నాటి పుష్పాచలేశ్వర ఆలయం ఉంది. దుర్గాదేవి ఆలయానికి ఈశాన్యంలో కొండపై వందల ఏళ్ల కిందట నిర్మించిన ఆలయం ఉన్నట్లు రచయిత, చరిత్రకారుడు తవ్వా ఓబులరెడ్డి తెలిపారు. నడిగట్టు ఆలయంగా పూర్వం పూజలు చేసేవారు. కాకతీయుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించిన ఆలయం హరిహర క్షేత్రంగా వెలుగొందింది. ఆలయంలో ఉమామహేశ్వరుడు, లక్ష్మీనారాయణ స్వామి, సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు మెకంజీ అధ్యయనం చెబుతోంది. 12వ […]