నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయరు నుంచి వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట జలాశయానికి కృష్ణా జలాలు చేరుతున్నాయి. 2026 ఆగస్టు 30వతేది రాత్రి నీటి చేరిక ప్రారంభమైంది. అవుకు జలాశయం నుంచి 57కి.మీ జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా ప్రవహించి గండికోట సొరంగం ద్వారా గండికోట ప్రాజెక్టులోకి 3300క్యూసెక్కులు నీరు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. 26.850టీఎంసీలు సామర్థ్యం కలిగిన జలాశయంలో ప్రస్తుతం 12.686టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 21.744టీఎంసీలు ఉండేవి.