Skip to main content

peru-seahorse-162111.hostingersite.com

రాజంపేట డివిజన్ అధికారులతో చర్చించిన కలెక్టరు

జిల్లాల పునర్విభజన తరువాత మొదటిసారి రాజంపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్  చెరుకూరి శ్రీధర్  నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో దర్శనం, ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయ పరిశీలనకు వచ్చిన కలెక్టరు  రాజంపేట సబ్ కలెక్టర్ భావన పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. సమావేశ మందిరంలో రాజంపేట రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండల తహసీల్దార్లతో సమావేశమయ్యారు. రెవెన్యూ డివిజన్ […]

బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం

ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ధీటుగా జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లెలోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్ధేలా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత నిధులతో బ్రహ్మంగారిమఠంను సర్వాంగ సుందరంగా రూపుదిద్దేలా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్ ను సిద్ధం చేయించారు. రూ.136.63కోట్లతో ప్రణాళికను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీం కింద నిధుల మంజూరుకు ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను గెలిపించిన ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే తపనతో ఎమ్మెల్యే ఉన్నారు.

పుష్పగిరిలో జైనమత ఆనవాళ్ళు

కడప జిల్లా పుష్పగిరిలో 10 శతాబ్దం నాటి జైన పాదుకలు వెలుగు చూసినట్లు రచయిత తవ్వా ఓబులరెడ్డి తెలిపారు. పుష్పగిరి లో వైష్ణవ, శైవ, వీరశైవ, శాక్తేయ, అఘోర, కాపాళిక మత శాఖలకు సంబంధించిన  ఆలయాలకు, చారిత్రక ఆనవాళ్ళకు నిలయంగా ఉండగా తాజాగా  జైన పాదుకల ఆవిష్కరణతో  పుష్పగిరి మత సాంస్కృతిక చరిత్రకు జైనమత ఆనవాళ్లు తోడైనట్లు రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి తెలిపారు.  క్రీ.శ. 10-13 శతాబ్దాల్లో  కర్నాటకలోని గుల్బర్గా సమీపంలోని ‘ ‘మాన్యఖేత’ రాజధానిగా  […]

పుష్పగిరిలో మరో శిలా శాసనం

దక్షిణ కాశిగా పిలువబడుతున్న పుష్పగిరిలో మరో శిలా శాసనం వెలుగుచూసింది. చెన్నకేశవ ఆలయం ముందుభాగంలో ఈశాసనాన్ని చరిత్రకారుడు, రచయిత తవ్వా ఓబులరెడ్డి గుర్తించారు. ‘యనమల చింతల చెన్నరాయునికి’ అని శిలా శాసనంలో చెక్కబడింది. యనమలచింతల గ్రామం కొండాపురం మండలంలో ఉంది. అక్కడ చెన్నకేశవ ఆలయం ఉంది. అయితే ఆ ఆలయం ప్రస్తావన పుష్పగిరిలో చేయబడటం విశేషమని ఓబులరెడ్డి తెలిపారు.

నీటి భద్రత తోనే దేశ భవిష్యత్తు

     నీటి భద్రతతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. నీటి భద్రత, సంరక్షణ, నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దిల్లీలో ఐఐటీ, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ లో జిల్లా రివర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ ఫ్రేమ్‌వర్క్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నీటి నిర్వహణ పై ప్యానలిస్ట్ గా జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. జిల్లాలో దీర్ఘకాలిక నీటి భద్రతకు నాలుగు పద్ధతులను వివరించారు. […]

అభివృద్ధి ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలి

జిల్లాలో అన్ని శాఖలకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ జిల్లాలోని శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ నాటికి జిల్లాలో అన్ని రంగాల్లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిపై ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలన్నారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు, మాధకద్రవ్యాల నిరోధం, గ్రామవార్డు సచివాలయాల్లో సేవల మెరుగు వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. […]

జిల్లాలో యధావిధిగా విమానయాన సేవలు

జిల్లాలో ఎప్పటిలాగే యథావిధిగా విమానయాన సేవలు కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందిస్తామని కడప ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ పోద్దార్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం కడప విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఇండిగో విమాన సేవల సంక్షోభం తరువాత భవిష్యత్తులో కడప విమానాశ్రయం అందించే సేవలను వివరించారు. 2025 డిసెంబర్ మొదటి వారంలో జరిగిన ఇండిగో (IndiGo) సంక్షోభం తరువాత ప్రస్తుతం కడప విమానాశ్రయం నుంచి అన్ని విమానాలు నిర్ణీత సమయానికి నడుస్తున్నాయి. […]

ఈశ్వరీ మహాదేవి ఆరాధన గురు పూజ మహోత్సవం

వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లెలో ఈ నెల 11వ తేది నుంచి ఈశ్వరీ మహాదేవి ఆరాధన గురు పూజ మహోత్సవం నిర్వహించనున్నారు. 11న పంచామృతాభిషేకం,  కుంకుమార్చన పూజలు, రాత్రి కలశోత్సవం, కలశ స్థాపన  ఉత్సవం, 12న పంచామృత అభిషేకం, కుంకుమార్చన పూజలు, అశ్వవాహన ఉత్సవం,  రాత్రి హంస వాహన ఉత్సవం,  13న ఈశ్వరీ మహాదేవి  సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం సందర్భంగా పంచామృతాభిషేకం, కుంకుమార్చన పూజలు, దీక్షా అలంకరణ ఉత్సవం, సింహ […]

గండికోట పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 

సాస్కి పథకంతో గండికోట పర్యాటక కేంద్రానికి ప్రపంచ స్థాయిలో కీర్తిని ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో గండికోట పర్యాటక అభివృద్ధి పనులపై డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జిల్లా పర్యాటక శాఖ, ఏపీటీడీసీ అధికారులు, కాంట్రాక్టు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గండికోట ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి […]

జిల్లావాసులకు త్వరలో అధునాతన విమానయాన సేవలు

              జిల్లా ప్రజలకు త్వరలో అధునాతన విమానయాన సర్వీసులు చేరువ కానున్నట్లు కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్.అవినాష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఎయిర్ పోర్టు నూతన టర్మినల్ బిల్డింగ్ కు నూతన రహదారుల ఏర్పాటు, అధునాతన స్నాక్ బార్ & ఫుడ్ ఫెసిలిటీ, ఎయిర్ పోర్ట్ […]