Skip to main content

peru-seahorse-162111.hostingersite.com

జనవరిలో గండికోట ఉత్సవాలు

వచ్చే ఏడాది జనవరిలో గండికోట ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మొదటి నాలుగు రోజులు ప్రమోషనల్ ఈవెంట్స్, మిగతా మూడు రోజులు ముఖ్యమైన ఈవెంట్స్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యమైన ఈవెంట్లలో భాగంగా నిర్వహించే ప్రదర్శనల్లో జాతీయ స్థాయిలో పేరు పొందిన మ్యూజిక్, డాన్స్ బృందాలను ఆహ్వానించాలని పేర్కొన్నారు. గండికోట ఉత్సవాల్లో స్వయం సహాయక గ్రూపు సంఘాలతో జిల్లా స్ట్రీట్ ఫుడ్, ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గండికోట […]

సామాజిక రుగ్మతలను తొలగించడమే లక్ష్యం

             జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పారదర్శకంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. జేసీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులలో […]

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి

     ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. 1949 జూలై 8. జమ్మలమడుగు సి.ఎస్.ఐ. క్యాంబెల్ మిషన్ ఆసుపత్రిలో జ‌న్మించారు. రాజ‌శేఖ‌ర‌రెడ్డి తండ్రి రాజారెడ్డి క‌ర్నాట‌క రాష్ట్రంలోని బళ్ళారిలో గుత్తేదారుగా పనిచేస్తుండటంతో రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాఠశాల చ‌దువు బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. విజయవాడ లయోలా కళాశాలలో చేరారు. 1972లో గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవిద్యలో పట్టా తీసుకున్నారు.  వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాలలో విద్యార్ధి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.తిరుప‌తిలోని వెంకటేశ్వర వైద్యకళాశాల నుంచి హౌస్‌సర్జన్ పట్టా […]

జీవీసత్రం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా

కడప జిల్లా మైదుకూరు మండలం జీవీసత్రం సమీపంలో 67వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం  ఆర్టీసీ కడప డిపోకు చెందిన బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. విజయవాడ నుంచి కడపకు వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యంలోని జీవీసత్రం వద్ద బైపాస్ పైకి చేరుకుంది.  జీవీసత్రంలో దిగాల్సిన ప్రయాణికులు ఉండటంతో బైపాస్ నుంచి జీవీసత్రం వైపు బస్సును మళ్లించారు. దాదాపు 2 అడుగుల ఎత్తు నుంచి బస్సు జీవీసత్రం దారిలోకి మళ్లే సమయంలో అదుపుతప్పి […]

ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్

ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్ చేపట్టేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జేసీ అదితి సింగ్ తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి పంట కొనుగోలుకు సంబంధించి జిల్లాలోని ఉల్లి ట్రేడర్లతో సమావేశం ఏర్పాటు చేసి, ఉల్లి కొనుగోలుపై సలహాలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న రైతుల నుంచి అధిక లాభాలను ఆశించరాదని  ట్రేడర్లకు సూచించారు. నష్టాల బాటలో […]

జిల్లా కలెక్టరును కలిసిన ఎస్పీ

జిల్లా ఎస్పీగా వచ్చిన షెల్కే నచికేత్ విశ్వనాథ్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ను  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం  అందజేశారు.

ఉద్యోగ ఉపాధ్యాయులను వంచెనకు గురిచేయొద్దు

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్టోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్  కూశెట్టి పాలకొండయ్య,  జిల్లా ఆర్థిక కార్యదర్శి గోశెట్టి రామమోహన్ డిమాండ్ చేశారు. ఆర్థిక పరమైన హామీల విషయంలో ఉద్యోగ ఉపాధ్యాయులను  వంచెనకు గురి చేయొద్దని కోరారు.  వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులోని విద్యాశాఖ కార్యాలయం వద్ద రాష్టోపాధ్యాయ సంఘం ఆధ్వర్యం లో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలాగా నేటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసపుచ్చుతూ  హామీల అమలులో […]

తుడుమలదిన్నె రైతుకు చేయూత

జీవనాధారానికి మూలమైన ఎడ్లను కోల్పోయి కుంగిపోయిన వైఎస్సార్ కడప జిల్లా తుడుమలదిన్నెకు చెందిన రైతు ఆదిరెడ్డికి ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి రూ. 50,000  ఆర్థిక సహాయం అందించి  చేయూత నిచ్చారు.  ఇటీవల గ్రామం వద్ద ఎడ్లబండితో వాగును దాటుతున్న సమయంలో ప్రవాహానికి కొట్టుకొని పోయి ఎడ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. రైతును ఆదుకునేందుకు తనవంతు సహాయాన్ని గంగాధర్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నేతలు ఇరగంరెడ్డి నాగేశ్వర్ రెడ్డి , ఆంజనేయ […]

రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

తెలుగు పద్య పఠనంలో వైఎస్సార్ కడప  జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలోని జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల బాలిక వీరమల్ల గౌరి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు.  వెనుకబడిన తరగతుల సంక్షేమ సంస్థ ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన పోటీలో గౌరి ప్రతిభను ప్రదర్శించారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. బాలిక గౌరిని ప్రిన్సిపాల్ నిర్మల అభినందించారు.

సాంకేతికతకు మూల పురుషుడు

కులవృత్తి గొప్పదనాన్ని, వైభవాన్ని, ప్రభావాన్ని, జీవనాధారాన్ని పెంపొందించడమే.. సాంకేతికతకు మూలపురుషుడైన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని పిజీఆర్ఎస్ హాలులో  జిల్లా బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రపంచ తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా.. ప్రవచనకారులు దేవశిల్పి విశ్వకర్మను ప్రస్తావించడం సమంజసమైనదన్నారు.  కేంద్ర రాష్ట్ర […]