Skip to main content

peru-seahorse-162111.hostingersite.com

భూ సమస్యల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం చూపాలి

భూ సంబంధిత అర్జీదారులు, ఫిర్యాదుదారుల అర్జీల పట్ల భాధ్యతాయుతంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కరించాలని  జిల్లా ఇంఛార్జి కలెక్టర్, జేసీ అదితి సింగ్ అధికారులకు సూచించారు.  కలెక్టరేట్ లోని సభాభవన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) లో వచ్చిన ఫిర్యాదులపై  డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, చిన్నయ్య, సర్వే ల్యాండ్స్ ఏడీ మురళీ కృష్ణ , మండలాల తహశీల్దార్లు, ఆర్ఐ, ఎంపిడివోలతో కలిసి సమీక్షా […]

ఉల్లి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి  

జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికే ప్రారంభమైన మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను  రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో రైతుల నుంచి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలు ప్రక్రియపై. ఉద్యాన, మార్క్ ఫెడ్ శాఖల అధికారులతో సమీక్షించారు.  క్వింటాల్ ఉల్లి ధర రూ.1200 /- ప్రకారం e-క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఉల్లి పంటను కొనుగోలు చేయడం […]

ప్రజల అప్రమత్తతోనే చైన్ స్నాచింగ్, చోరీలకు అడ్డుకట్ట

చైన్ స్నాచింగ్, చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైదుకూరు అర్బన్ సర్కిల్ ఇన్ స్పెక్టరు కె.రమణారెడ్డి తెలిపారు. పోలీసు సూచనలు పాటించాలని కోరారు. మీరు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో,  చుట్టు పక్కల ఎవరైనా అనుమానస్పంగా కొత్త వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే 112 పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు. బంగారు ఆభరణములు ధరించి మహిళలు ఒంటరిగా వాకింగ్ కు గాని నిర్మానుష్యమైన ప్రదేశం  కు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవ్వరైనా […]

నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం హెల్ప్ లైన్

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి వైఎస్ఆర్ కడప జిల్లా  యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లా కేంద్రం కలెక్టరేట్ ప్రాంగణంలో కంట్రోల్ రూంను ఏర్పాటు ఏర్పాటు చేసింది. సెల్ నెంబరు 08562-246344కు కాల్ చేయాలని సూచించారు. ఖాట్మండ్ హెల్ప్ లైన్ నంబర్లు: 977- 980 860 2881, 977- 981 032 6134 ఏపీకి చెందిన ప్రజల కోసం ఢిల్లీ ఏపీ భవన్ లో  ఏర్పాటు చేసిన హెల్ప్ […]

కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి వేగంగా అడుగులు

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నోడోమ్.. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో నూతనంగా ఏర్పాటుచేసిన ఎల్ఈడీ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా టెక్నోడోమ్ ఎల్ఈడీ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు సంస్థ ప్రతినిధులు, సిబ్బంది ఘనస్వాగతం […]

కొప్పర్తికి పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత నాది

మహిళలు, పురుషులు సమానమని నమ్మే పార్టీ, ప్రభుత్వం.. ఎన్డీయే, తెలుగుదేశం అని, మహిళలకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండిస్ట్రియల్ హబ్ లో ప్రముఖ రెడీమేడ్ దుస్తుల తయారీ కంపెనీ టెక్సానా మాన్యుఫాక్చరింగ్ నూతన యూనిట్ ప్రారంభం అనంతరం అక్కడ పనిచేసే మహిళా సిబ్బందితో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి […]

స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్

దేశంలోనే తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె ఎంపీపీ పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. కమలాపురం 2, జమ్మలమడుగు 2, కడపలో 1 స్మార్ట్ కిచెన్ ను మంత్రి లోకేష్ వర్చువల్ గా ప్రారంభించారు. డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలలకు చెందిన 10,332 […]

పెండ్లిమర్రిలో ఆదర్శ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్

కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో రూ.12కోట్ల రూసా నిధులతో నిర్మించిన ఆధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. పిఎం ఉష పథకంలో భాగంగా నిర్మించిన పరిపాలన బ్లాక్ ను మంత్రి ప్రారంభించారు. బీఏ ఎకనమిక్స్ ద్వితీయ సంవత్సరం తరగతి గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భావిభారత పౌరులను తయారు చేయడంలో విద్యాశాఖ కీలకమైనదని, కష్టమైనది అయినా భావిభారత పౌరులను తయారుచేసే విద్యాశాఖను […]

ఆలయాలు గ్రామస్థుల మధ్య బంధాలను పెంచేలా ఉండాలి

గ్రామాల్లో నిర్మించే ఆలయాలు గ్రామస్థుల మధ్య బంధాలను పెంచేలా ఉండాలే కానీ గ్రామస్థుల మధ్య విభేదాలను పెంచేలా ఉండకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుత్తిలో పెద్దమ్మ తల్లి ఆలయానికి సంబంధించి ప్రహరీ గోడ నిర్మాణ విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన అభ్యంతరాలు,  విభేదాల పరిష్కారం కోసం జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి కలెక్టరు గ్రామం చేరుకుని ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […]

ఉపాధి వనరుల ఖిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్

జిల్లాలో ప్రధాన ఉపాధి వనరుల ఖిల్లాగా కొప్పర్తి ఏపీఐఐసీ మెగా ఇండస్ట్రియల్ హబ్ వెలుగొందుతోందని ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొరత లేదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు.  కొప్పర్తి లో దాదాపు 600 ఎకరాల్లో ఏర్పాటైన మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను జిల్లా కలెక్టర్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ కలిసి పరిశీలించారు. సెప్టెంబర్ 2న రాష్ట్ర విద్యాశాఖ, ఐటి […]