Skip to main content

peru-seahorse-162111.hostingersite.com

మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా చెన్నకేశవ ప్రసాద్

కడప జిల్లా మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా బల్లాని చెన్నకేశవ ప్రసాద్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో నిర్వహించిన సమావేశంలో చెన్నకేశవ ప్రసాద్ తోపాటు మరో 35 మంది సభ్యులచే పూర్వసభ అధ్యక్షుడు సూరిశెట్టి శివ వెంకట ప్రసాద్ గుప్తా ప్రమాణ స్వీ కారం చేయించారు. బద్వేలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బా రావు, తితిదే పూర్వ సభ్యులు ప్రసాద్, మారుతీ ప్రసాద్, ఆర్యవైశ్య సంఘం జిల్లా పూర్వ […]

డి.ఎల్.రవీంద్రారెడ్డి

            రాజ‌కీయాల్లో సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుల్లో ర‌వీంద్రారెడ్డి ఒక‌రు. అటు పార్టీలోనూ ఇటు ప‌లు ముఖ్యమంత్రుల వ‌ద్ద మంత్రివ‌ర్గంలోనూ ప‌ద‌వులు నిర్వహించి త‌న‌కు తానే సాటిగా విభిన్నశైలిలో న‌డుస్తున్న నాయ‌కుడిగా ర‌వీంద్రారెడ్డిని చెప్పవ‌చ్చు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మనుగడ లేదని గుర్తించి 2014 ఎన్నికలకు దూరమై రాజకీయ చతురతను ప్రదర్శించారు. అప్పట్లో పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల నాటికి వైఎస్సార్ […]

ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాల బహూకరణ

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కడప జిల్లా పోలీసు పెరేడ్ ప్రాంగణంలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న  మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్, పక్కన జిల్లా కలెక్టరు చెరుకూరి శ్రీధర్, జేసీ అదితి సింగ్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  

జిల్లాలో ఘనంగా “స్త్రీ శక్తి” పథకం ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్త్రీ శక్తి” పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం కడప ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ప్రారంభించారు.  రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రత్యేకంగా అలంకరించిన పలు […]

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెదేపా విజయం

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థి మా రెడ్డి లతారెడ్డి విజయం సాధించారు.  మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాఖాలోనే  తెదేపా అభ్యర్థి విజయం సాధించడంతో ఆపార్టీ నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.  తెదేపా అభ్యర్థి లతారెడ్డికి 6713 ఓట్లు లభించగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు లభించాయి. 

ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నిక

ఒంటి మిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం నందు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిల్చున్న ఓటర్లు

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక

పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికకు సంబంధించి ఎర్రబల్లి ప్రాథమిక పాఠశాల లలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం బూత్ నెంబర్లు- 9,10 లలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిల్చున్న ఓటర్లు    

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

రోడ్డు భద్రత చర్యలను జిల్లాలో మరింత కఠినతరం చేసి రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబందిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని బోర్డు రూమ్ హాలులో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న రహదారులపై ఎన్ ఫోర్స్ మెంట్ చర్యలను కఠినతరం చేయాలని, ప్రధాన రహదారుల్లో డివైడర్లను బ్రేక్ చేసి […]