పెండ్లిమర్రిలో ఆదర్శ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్

కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో రూ.12కోట్ల రూసా నిధులతో నిర్మించిన ఆధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. పిఎం ఉష పథకంలో భాగంగా నిర్మించిన పరిపాలన బ్లాక్ ను మంత్రి ప్రారంభించారు. బీఏ ఎకనమిక్స్ ద్వితీయ సంవత్సరం తరగతి గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భావిభారత పౌరులను తయారు చేయడంలో విద్యాశాఖ కీలకమైనదని, కష్టమైనది అయినా భావిభారత పౌరులను తయారుచేసే విద్యాశాఖను […]