పుష్పగిరిలో జైనమత ఆనవాళ్ళు

కడప జిల్లా పుష్పగిరిలో 10 శతాబ్దం నాటి జైన పాదుకలు వెలుగు చూసినట్లు రచయిత తవ్వా ఓబులరెడ్డి తెలిపారు. పుష్పగిరి లో వైష్ణవ, శైవ, వీరశైవ, శాక్తేయ, అఘోర, కాపాళిక మత శాఖలకు సంబంధించిన ఆలయాలకు, చారిత్రక ఆనవాళ్ళకు నిలయంగా ఉండగా తాజాగా జైన పాదుకల ఆవిష్కరణతో పుష్పగిరి మత సాంస్కృతిక చరిత్రకు జైనమత ఆనవాళ్లు తోడైనట్లు రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి తెలిపారు. క్రీ.శ. 10-13 శతాబ్దాల్లో కర్నాటకలోని గుల్బర్గా సమీపంలోని ‘ ‘మాన్యఖేత’ రాజధానిగా […]
పుష్పగిరిలో మరో శిలా శాసనం

దక్షిణ కాశిగా పిలువబడుతున్న పుష్పగిరిలో మరో శిలా శాసనం వెలుగుచూసింది. చెన్నకేశవ ఆలయం ముందుభాగంలో ఈశాసనాన్ని చరిత్రకారుడు, రచయిత తవ్వా ఓబులరెడ్డి గుర్తించారు. ‘యనమల చింతల చెన్నరాయునికి’ అని శిలా శాసనంలో చెక్కబడింది. యనమలచింతల గ్రామం కొండాపురం మండలంలో ఉంది. అక్కడ చెన్నకేశవ ఆలయం ఉంది. అయితే ఆ ఆలయం ప్రస్తావన పుష్పగిరిలో చేయబడటం విశేషమని ఓబులరెడ్డి తెలిపారు.