తుడుమలదిన్నె రైతుకు చేయూత

జీవనాధారానికి మూలమైన ఎడ్లను కోల్పోయి కుంగిపోయిన వైఎస్సార్ కడప జిల్లా తుడుమలదిన్నెకు చెందిన రైతు ఆదిరెడ్డికి ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి రూ. 50,000 ఆర్థిక సహాయం అందించి చేయూత నిచ్చారు. ఇటీవల గ్రామం వద్ద ఎడ్లబండితో వాగును దాటుతున్న సమయంలో ప్రవాహానికి కొట్టుకొని పోయి ఎడ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. రైతును ఆదుకునేందుకు తనవంతు సహాయాన్ని గంగాధర్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నేతలు ఇరగంరెడ్డి నాగేశ్వర్ రెడ్డి , ఆంజనేయ […]