పూలసుబ్బయ్య

కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలతో అనుబంధం పెంచుకున్న నాయకుడు పూల సుబ్బయ్య. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతంలో రాజకీయ ప్రాతినిథ్యం వహించిన సుబ్బయ్య కంభంలో 1929 జూన్ 4న జన్మించారు. 1988జూన్ 23న కన్నుమూశారు. 1952లో కంభం పంచాయతీ వార్డు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి చెందిన పూల సుబ్బయ్య ఆతరువాత మార్కాపురం చేరుకుని న్యాయవాదిగా పనిచేస్తూ ప్రజలతో సంబంధాలను పెంచుకున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. మార్కాపురం, యర్రగొండపాలెం, ప్రకాశం ప్రాంతాలు […]