
చెట్ల కొమ్మలను అంటిపెట్టుకుని తలకిందులుతూ వేలాడుతూ కనిపించే గబ్బిలాలు వైఎస్సార్ కడప జిల్లా డయాంఖానపల్లెలో రామాలయం వద్ద కనిపిస్తున్నాయి. వందలాది పక్షులు దశాబ్దాలుగా గ్రామాన్ని అంటి పెట్టుకుని ఉన్నాయి. చీకటి పడగానే ఆహారం కోొసం వెళ్లిపోయే ఈ గబ్బిలాలు అర్ధరాత్రి వరకు తిరిగి చెట్టు వద్దకు చేరుకుని కనిపిస్తాయి. గబ్బిలాలను గ్రామస్తులు దేవతా పక్షులుగా భావించి వేటగాళ్ల బారి నుంచి కాపాడుతున్నారు. గ్రామస్తులు వీటిని గవాజీ పక్షులుగా కొన్నిచోట్ల చీకిరేవులుగా పిలుస్తూ ఉంటారు.
