పుష్పగిరిలో గుర్తించిన శాసనం
దక్షిణ కాశిగా పిలువబడుతున్న పుష్పగిరిలో మరో శిలా శాసనం వెలుగుచూసింది. చెన్నకేశవ ఆలయం ముందుభాగంలో ఈశాసనాన్ని చరిత్రకారుడు, రచయిత తవ్వా ఓబులరెడ్డి గుర్తించారు. ‘యనమల చింతల చెన్నరాయునికి’ అని శిలా శాసనంలో చెక్కబడింది. యనమలచింతల గ్రామం కొండాపురం మండలంలో ఉంది. అక్కడ చెన్నకేశవ ఆలయం ఉంది. అయితే ఆ ఆలయం ప్రస్తావన పుష్పగిరిలో చేయబడటం విశేషమని ఓబులరెడ్డి తెలిపారు.
