జిల్లాలో అన్ని శాఖలకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ జిల్లాలోని శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ నాటికి జిల్లాలో అన్ని రంగాల్లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిపై ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలన్నారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు, మాధకద్రవ్యాల నిరోధం, గ్రామవార్డు సచివాలయాల్లో సేవల మెరుగు వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలన్నారు.
