ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ధీటుగా జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లెలోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్ధేలా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత నిధులతో బ్రహ్మంగారిమఠంను సర్వాంగ సుందరంగా రూపుదిద్దేలా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్ ను సిద్ధం చేయించారు. రూ.136.63కోట్లతో ప్రణాళికను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీం కింద నిధుల మంజూరుకు ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను గెలిపించిన ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే తపనతో ఎమ్మెల్యే ఉన్నారు.





